విషాదం : ఇండియన్ స్టార్ సింగర్ ఆకస్మిక మరణం..గుండె తరుక్కుపోయే వార్త ఇది

ఈరోజు తెల్లవారుతుండడంతోనే చాలా మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ కి ఒక బ్యాడ్ మార్నింగ్ లా స్టార్ట్ అయ్యింది. మన దేశానికి చెందిన ప్రముఖ గాయకుడు అనేక భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని పాడిన సింగర్ అనుకోని రీతిలో కన్ను మూసాడు అనే వార్త షాకింగ్ గా అత్యంత విషాదంగా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, 7జి బృందావన కాలనీ, మనసంతా నువ్వే ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో పాటలు బాలీవుడ్ తమిళ్ లో కూడా ఎన్నో పాటలు పాడిన గాయకుడు కృష్ణ కుమార్ కునాధ్( కే కే ) తన 53వ ఏట కన్ను మూసాడు. నిన్న రాత్రి కోల్ కతా లో లైవ్ లో పాట పాడుతూనే సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు.

దీనితో వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ మధ్యలోనే మరణించారు. దీనితో ఇలా ఓ స్టార్ సింగర్ తన వృత్తి పాటలు పాడుతూనే కన్ను మూయడం అనేది ప్రతి ఒక్కరినీ ఎంత గానో కదిలించేస్తుంది. దీనితో అనేక మంది సినీ ప్రముఖులు అభిమానులు కే కే మరణం పట్ల చింతిస్తూ ఇంత చిన్న వయసులో అతడు చనిపోయి ఉండాల్సింది కాదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.