వైరల్ : ‘పుష్ప 2’ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రష్మికా 

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హైప్ లో ఉన్న పలు భారీ చిత్రాల్లో అయితే దర్శకుడు సుకుమార్ మరియు పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన హ్యాట్రిక్ కాంబినేషన్ చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. మరి పుష్ప కి సీక్వెల్ గా వచ్చిన ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు శరవేగంగా అయితే చిత్రీకరణ జరుపుకుంటుంది.

కాగా రీసెంట్ గానే ఒకొక అప్డేట్ సినిమా నుంచి అయితే అందిస్తూ వస్తుండగా ఇప్పుడు ఈ భారీ చిత్రంపై హీరోయిన్ రష్మికా మందన్నా అయితే క్రేజీ అప్డేట్ అందించింది. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. డైరెక్ట్ గా సినిమా సెట్స్ నుంచే పిక్ తీసి షేర్ చేసింది.

దీనితో ఈ పిక్స్ వైరల్ గా మారగా డైరెక్ట్ చిత్ర నిర్మాణ సంస్థ కూడా పుష్ప 2 కోసం వేసిన భారీ సెట్టింగ్స్ లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నామని కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే పుష్ప 2 ని చాలా లావిష్ గా గ్రాండ్ మ్యానర్ లో నిర్మాణం వహిస్తున్నారు. మరి చూడాలి సినిమాని ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు అనేది.

ఇక ఈ సినిమాలో మరింతమంది స్టార్స్ నటిస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ గా అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా ఎన్నో వచ్చే ఏడాది వేసవి రేస్ లో అయితే సినిమాని రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు.