కాంతర సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక. మండిపడుతున్న కన్నడిగులు?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈమె అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ గా గుర్తింపు పొందారు.ఇలా వరుస తెలుగు తమిళ హిందీ భాషలలో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా రష్మిక నేడు ఈ స్థానంలో ఉందంటే అందుకు గల కారణం రిషబ్ శెట్టి అని చెప్పాలి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కిరిక్ పార్టీ ద్వారా ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇకపోతే తాజాగా హీరో రిషబ్ శెట్టి ఆయన దర్శకత్వంలోనే వచ్చినటువంటి కాంతార సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి ఆధారాభిమానాలను అందుకుంటుందో మనకు తెలిసిందే. ఇలా దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై నటి రష్మిక మందన్న స్పందించకపోవడంతో అభిమానులు మండిపడ్డారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు కాంతార సినిమా గురించి మరోసారి ప్రశ్న ఎదురయింది. కాంతార సినిమా చూశారా ఈ సినిమా పట్ల మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే రష్మిక ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను ఇప్పటివరకు కాంతార సినిమా చూడలేదని సమాధానం ఇచ్చారు. ఇలా ఈమె కాంతార సినిమా చూడలేదని చెప్పడంతో ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులు రష్మికపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సొంత భాషా చిత్రం అలాగే తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన రిషబ్ శెట్టి నటించిన సినిమా దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోగా అలాంటి సినిమాని రష్మిక చూడలేదని సమాధానం చెప్పడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున కన్నడ ప్రేక్షకులు రష్మిక తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.