‘ఉప్పెన’ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా అంగీకరించారు. క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక.

అడవి నేపథ్యంలో జరిగే కథ ఇది. రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయడానికి క్రిష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు తాజాగా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ప్రారంభించారు.ఏకధాటిగా 45 రోజులు షూట్ చేసి, ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా షుటింగ్లో పాల్గొంటూ ఇన్స్టాగ్రామ్లో మేకప్ వేసుకుంటున్న ఓ చిన్న వీడియోను షేర్ చేసి.. ‘ఇన్నాళ్లూ షూటింగ్ లను బాగా మిస్సయ్యాను’ అని రాసుకొచ్చింది రకుల్.
నాలుగైదు నెలల తర్వాత ఇలా బిజీ కావడం హ్యాపీగా ఉందంటున్నారు రకుల్. అలాగే నిర్మాత బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ ఓ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు పేరు వెల్లడించలేదు. లవ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాతో కాశ్వీ నాయర్ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. భూషణ్ కుమార్, జాన్ అబ్రహం, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ, క్రిషన్ కుమార్, మోనిషా అద్వానీ నిర్మిస్తున్నారు.
