కామెడీ టైమింగే నన్ను ఆకట్టుకుంది : భర్త జాకీ భగ్నానీపై రకుల్‌ ప్రీత్‌ కామెంట్‌!

వివాహమైన తర్వాత తొలిసారి తన భర్త జాకీ భగ్నానీ గురించి మాట్లాడారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అస్సాం వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాకీ తనకు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువని చెప్పగా, పక్కనే ఉన్న రకుల్‌ అది నిజమేనన్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ‘జాకీ మంచి మనసు, హాస్య చతురత కలిగిన వ్యక్తి. అతడిలోని కామెడీ టైమింగే తొలుత నన్ను ఆకర్షించింది. తను ఎప్పుడూ సరదాగా ఉంటాడు. చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండేలా చూస్తాడు’ అని ఆమె అన్నారు.

కన్నడ చిత్రం ‘గిల్లీ’తో తెరంగేట్రం చేసిన రకుల్‌ హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో ఆమెకు పరిచయం ఏర్పడిరది. గత మూడేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 21న వీరి పెళ్లి జరిగింది. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. వివాహం అనంతరం ఇటీవల అస్సాం టూర్‌కు వెళ్లారు. అక్కడి ప్రముఖ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అస్సాం స్టేట్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.