Rajamouli: బాలీవుడ్‌ అగ్రిమెంట్ బ్రేక్ చేశాడంటూ కంప్లైంట్ చేసిన రాజమౌళి ..!

Rajamouli: బాహుబలి తర్వాత టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. గతనెల విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో సునామీ సృష్టిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి అద్భతమైన రెస్పాన్స్ వస్తోంది. దాదాపు రూ. 450 కోట్ల బారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ముంబైయిలో సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్స్ అమిర్ ఖాన్, కరణ్ జోహార్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్నందుకు వారు చిత్రయూనిట్‏కు అభినందనలు తెలిపారు.

అయితే ఏదైనా సినిమా విడుదలవుంది అంటే ఆ చిత్రయూనిట్ ఎంత ఒత్తిడికి గురవుతుందో తనకు తెలుసన్న అమీర్ ఖాన్, ఆర్ఆర్ఆర్ రిలీజై ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత రాజమౌళి అండ్ టీమ్ చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాగే ఆయన మరిన్ని సినిమాలు తీయాలని, అద్భుతమైన విజయాలు అందుకోవాలని అమీర్ ఖాన్ ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ఇకపోతే దర్శక ధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ ఈవెంట్‌లో మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. అందులో భాగంగా ఆయన ఎవరికీ తెలియని ఓ సీక్రెట్‌ను షేర్ చేసుకున్నారు. అమిర్ ఖాన్‌, తాను పేర్లు పెట్టి పిలిచుకోకూడదని, అంటే సర్, గారు అనే పదాలు ఉపయోగించుకోకూడదని ఈ మధ్యే తామిద్దరం ఒక ఒప్పందం పెట్టుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. దాని ప్రకారమే తాను ఆయన్ని సర్ అని కాకుండా ఏకే అని పిలుస్తున్నానని, కానీ మొదట్లో కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పారు. ఆమిర్ ఒత్తిడి చేయడంతోనే తాను ఆయన్ని ఏకే అని పిలిచానంటూ రాజమౌళి స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్, తమ మధ్య ఉన్న అగ్రిమెంట్ ను బ్రేక్ చేసి నన్ను రాజాజీ అని పిలుస్తున్నారంటూ ఆయన అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.