RRR: బాలీవుడ్ మీడియా పై ఫోకస్ చేసిన జక్కన్న.. రాధే శ్యామ్ ఎఫెక్టేనా..!

RRR:రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటిసారిగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా జనవరికే పూర్తయి విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇపుడు మార్చి 25 న విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రచారాన్ని జనవరిలో పెద్ద ఎత్తున చేసిన చిత్ర యూనిట్ ఇపుడు అంత ఖర్చు పెట్టకుండా సినిమా విడుదలకు వారం ఉండగా మొదలుపెడుతోంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మరోసారి దర్శకుడు రాజమౌళి చాలా బలంగా సిద్ధమవుతున్నాడు. దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసి ఉంచారు.

ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమాకు బాలీవుడ్ నుంచి నెగిటివ్ కామెంట్లు రావటంతో జక్కన్న బాలీవుడ్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ప్రమోషన్లలో భాగంగానే బాలీవుడ్ లో దాదాపు అన్ని చానల్స్ కు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. కాగా ఇప్పుడు రాజమౌళి బాలీవుడ్ మీడియాలో ఆకర్షించే విధంగా వారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. వీలైనంతవరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా కి బాలీవుడ్ లో నెగిటివ్ టాక్ రాకుండా ఉండడానికి అక్కడే డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే అక్కడి బాలీవుడ్ మీడియా ని కూడా భాగస్వాములు చేయాలని హిందీ పిఆర్ఓ ల తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఆర్ఆర్ చిత్రాన్ని బాలీవుడ్ లో పెన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సంస్థకు టాలీవుడ్ పై పట్టు ఉండడంతో వాళ్లు కూడా రాజమౌళి ఆలోచనలకు తగ్గట్టు అక్కడి మీడియా ని లైన్ లో పెట్టే పనిలో ఉన్నారట.దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రమోషన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి అని మొదటినుంచే ఆలోచిస్తూ ఉంటాడు.  సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక క్లారిటీ తో ముందుకు తీసుకెళ్తాడు. ఒక సినిమాకు హైప్ క్రియేట్ చేయాలి అంటే రాజమౌళి తర్వాత ఎవరైనా అన్నది బాహుబలి విషయంలోనే అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇంత ముందు చూపుతో అడుగులు వేసే జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల గురించి ఏం ఆలోచించారు చూడాలి.