అంత వరకు ఓపిక పట్టండి.. ‘రాధేశ్యామ్’ టీజర్‌పై డైరెక్టర్ ట్వీట్ వైరల్

Radha krishna kumar tweet on Prabhas Radhe shyam Teaser

రాధేశ్యామ్ సినిమా యూనిట్, దర్శక నిర్మాతలపై వచ్చినన్నీ ట్రోలింగ్ ఇంకెవరిపై వచ్చి ఉండవు. రాధేశ్యామ్ విషయంలో యూవీ క్రియేషన్స్ అలసత్వం వహిస్తోందని, సరైన అప్డేట్లు, ప్రమోషన్స్ చేపట్టడం లేదని ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. సినిమా మొదలైన ఏడాది దాటినా కూడా సినిమా టైటిల్, పోస్టర్ కూడా రిలీజ్ చేయకపోవడంతో దారుణంగా ట్రోల్ చేశారు. బ్యాన్ యూవీ క్రియేషన్స్ అంటూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ చేశారు.

Radha krishna kumar tweet on Prabhas Radhe shyam Teaser
Radha krishna kumar tweet on Prabhas Radhe shyam Teaser

ఆ దెబ్బకు వెంటనే రాధేశ్యామ్ అంటూ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ తరువాత కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పూజా హెగ్డే, ప్రభాస్ బర్త్ డేలకు సపరేట్ పోస్టర్లను రిలీజ్ చేశారు. అయినా కూడా అభిమానుల ఆకలి మాత్రం తీరలేదు. ఇంకా ఏదో ఆశిస్తూనే ఉన్నారు. అప్డేట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అప్డేట్ ఇవ్వమని నిత్యం అడుగుతూనే ఉన్నారు. తాజాగా రాధేశ్యామ్‌పై డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు.

రాధాకృష్ణ కుమార్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతుంటాడు. అది కూడా కేవలం రాధేశ్యామ్‌కు సంబంధించిన విషయాలే. తాజాగా మరోసారి రాధాకృష్ణ ట్వీట్ చేశాడు. టీజర్ అప్డేట్ త్వరలోనే వస్తుంది.. అతి త్వరలోనే రాబోతోంది.. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండండి.. మీ ఓపిక, సహనానికి తగిన ప్రతిఫలం వచ్చేలానే ఆ టీజర్ ఉంటుంది.. ఒట్టు… అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇలా హామీ ఇవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.