pushpa Movie: ‘పుష్ప: ది రైజ్’ త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ … ఎప్పుడంటే?

pushpa Movie: అల్లు అర్జున్ హీరోగా…నేషనల్ క్రష్ రష్మికా మందన హీరోయిన్‌గా.. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఒక ట్రెండ్‌ని జాతీయ స్థాయిలో సెట్ చేసింది అనే మాట వాస్తవం. ఈ సినిమాలోని ఎన్నో డైలాగ్‌లు, సన్నివేశాలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇక అందులోని సాంగ్స్ కుర్రకారునే కాక, చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా స్టెప్స్ వేసేటట్టు ఉండడంతో అది కూడా ఆ సినిమా హిట్‌ కావడానికి మరో కారణమైంది. ఇక ఆ సినిమాలో తగ్గేదేలే అని డైలాగ్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ఆ డైలాగ్‌తో చాలా మంది సెలబ్రెటీలు సైతం అనుకరిస్తూ సోషల్ మీడియాను కుదిపేశారంటే మామూలు విషయం కాదు.

ఇకపోతే కూలి నుంచి సిండికేట్ స్థాయికి ఓ వ్యక్తి ఏ విధంగా పైకి వచ్చాడు అనే కథాంశంతో తీసిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా రెండో భాగం కూడా త్వరలో షూటింగ్ మొదలు కానుంది. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో ఆ సినిమా వస్తుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ తీయడం మామూలైపోయింది. బాహుబలి, ఎన్టీఆర్ కథానాయకుడు, రక్త చరిత్ర లాంటి సినిమాలు కూడా అలాంటి ధోరణకి చెందినవే. ప్రస్తుతం కేజీఎఫ్‌తో పాటు పుష్ప సినిమా కూడా పార్ట్‌ 2 గా తెరకెక్కడానికి సిద్ధమయ్యాయి. అయితే ఇప్పటికే OTTలో విడుదల చేసిన హిందీ పుష్ప సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేయగా, పుష్ప ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా 365 కోట్లు వసూలు చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి 13న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 2021లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ప్రస్తుతం దాని సీక్వెల్‌తో అల్లు అర్జున్‌.. పుష్ప ది రూల్ అనే పేరుతో సినీ అభిమానులను మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు సమాచారం.