లైగర్ డిస్ట్రిబ్యూటర్లకు 13 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న పూరి!

puri jagannath

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ భారీ నష్టాలను చవిచూస్తున్నారు.ఈ సినిమా విడుదలకు ముందు సినిమాపై ఎన్నో అంచనాలను కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమాని భారీ ధరలకు కొనుగోలు చేశారు.

ఈ సినిమా కేవలం ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రమే భారీగా చేశారని సినిమాలో ఏమాత్రం కంటెంట్ లేకపోవడంతో మొదటి షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా ఫస్ట్ సౌత్ తోనే డిజాస్టర్ కావడంతో ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడం డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను ఎదుర్కోవడం జరిగింది.ఇలా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడంతో పెద్ద ఎత్తున డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఒత్తిడి తీసుకువస్తూ తమ డబ్బును తమకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ విధంగా పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్లు అధికంగా ఒత్తిడి తీసుకురావడంతో ఈయన కొంతమేర డబ్బును తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్ర ఏరియా డిస్ట్రిబ్యూటర్లకు 6 కోట్లు. నైజాం 4.5 సీడెడ్ 2.25కోట్ల రూపాయలను వెనక్కి తిరిగి చెల్లించాలని పూరి జగన్నాథ్ భావించినట్లు సమాచారం. మరి పూరి జగన్నాథ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.