ప్రాజెక్ట్ K.. ఫీనిషింగ్ టచ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిఅమ తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథాంశం మూడో ప్రపంచం యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

ఇక మైథాలజీ క్యారెక్టర్స్ ని అడ్వాన్స్ ఫ్యూచర్ లోకి తీసుకెళ్ళి కొత్తగా చూపించే ప్రయత్నం నాగ్ అశ్విన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబచ్చన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ని ఎంపిక చేశారు. మూవీలో వారి పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ షూటింగ్ లో అమితాబచ్చన్ గాయానికి గురైన విషయం విదితమే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా దృవీకరించింది.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ మేగ్జిమమ్ పూర్తయినట్లు సమాచారం. 90 శాతం షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసారట. ఇక పది శాతం మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉందని, అది కూడా అమితాబచ్చన్ కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది. బిగ్ బి కోలుకున్న వెంటనే పెండింగ్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేయాలనే యోచనలో ఉన్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరణ అంతా జరుగుతుంది.

ఇక ఈ సినిమాకి సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయిన మరో ఆరు నుంచి ఎనిమిని నెలల సమయం పట్టొచ్చు అని నిర్మాత అశ్వినీదత్ కూడా ఇప్పటికే చెప్పారు. ఇదిలా ఉంటే మరో వైపు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కావడంతో నిర్మాత భూషణ్ కుమార్ ఈ బిజినెస్ మొదలు పెట్టినట్లు బిటౌన్ లో టాక్. ఇప్పటికే నైజాం ఏరియా రైట్స్ అమ్ముడైపోయినట్లు తెలుస్తుంది.