సలార్ సెకండ్ షెడ్యూల్ ని ప్రారంభించబోతున్న ప్రశాంత్ నీల్..!

సలార్..కేజీఎఫ్ 1 తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియన్ డైరెక్టర్ గా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 ని కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ వచ్చి ఊహించని రేంజ్ లో రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంత అంచనాలు పెరిగేలా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రాలను రూపొందించాడు. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అన్న భారీ యాక్షన్స్ ఎంటర్‌టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసందే. ఫస్ట్ షెడ్యూల్ లో తెరకెక్కించిన సీన్స్ అద్భుతంగా వచ్చాయని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతున్నారు.

కాగా సలార్ సెకండ్ షెడ్యూల్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కాబోతోంది. సెకండ్ షెడ్యూల్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తోంది. అయితే త్వరలో మొదలయ్యే షెడ్యూల్ లో ప్రభాస్ – శృతి హాసన్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనే సీన్స్ ని కంప్లీట్ చేస్తారని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు కొన్ని ప్రత్యేకమైన సెట్స్ కూడా రెడీ అయినట్టు చిత్ర యూనిట్ ద్వారా అందుతున్న సమాచారం.

కాగా సలార్ సినిమా అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. లేదా 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇక ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యాం జూలై 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీ దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ని నిర్మిస్తున్నారు. కృష్ణం రాజు – భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటలీ నేపథ్యంలో రాధే శ్యాం పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.