డాక్ట‌ర్‌ని బుట్ట‌లో ప‌డేసిన ప్ర‌భుదేవా.. నిజ‌నిజాలు చెప్పుకొచ్చిన‌ మైకేల్ జాక్స‌న్ సోద‌రుడు

న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడు, ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా త‌న‌కు ట్రీట్‌మెంట్ చేసిన డాక్ట‌ర్‌ని బుట్ట‌లో ప‌డేసి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడ‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియ‌క అభిమానులు ఆరాలు తీసే ప‌నిలో ఉన్నారు. తాజాగా ప్ర‌భుదేవా పెళ్ళిపై ఆయ‌న సోద‌రుడు రాజు సుంద‌రం అధికారికంగా ధృవీకరించారు. ఫిజియోథెర‌పిస్ట్ గా ప‌నిచేసిన డాక్ట‌ర్ హిమానిని కొన్ని నెలల క్రితం నుండి ప్ర‌భుదేవా వెన్నునొప్పికి చికిత్స చేసుంది. వారు కొంతకాలం ఒకరితో ఒకరు డేటింగ్ చేసారు. రీసెంట్‌గా పెళ్ళి చేసుకున్న‌ నూతన వధూవరులు ఇప్పుడు చెన్నైలో కలిసి నివసిస్తున్నారు అని చెప్పుకొచ్చారు

47 ఏళ్ళ ప్ర‌భుదేవాకు రామ‌ల‌త‌తో ఇప్ప‌టికే వివాహం జ‌ర‌గ‌గా, అనుకోని కార‌ణాల వ‌ల‌న 2011లో విడిపోయారు. వారికి ఇద్ద‌రు వారసులు కూడా ఉన్నారు. అయితే రామ‌ల‌త నుండి విడిపోయిన త‌ర్వాత న‌య‌న‌తారతోను ప్రేమాయ‌ణం సాగించాడు. అదీ వ‌ర్క‌వుట్ కాకపోవ‌డంతో సైలెంట్ అయ్యాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తొమ్మిది సంవత్సరాల తరువాత ప్రభుదేవా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో ఆయ‌న మేన‌కోడ‌లిని చేసుకోనున్న‌ట్టు ప్ర‌చారం జరిగిన దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

ఫిజియోథెర‌పిస్ట్‌ని లాక్‌డౌన్ స‌మ‌యంలోనే ప్ర‌భుదేవా పెళ్ళి చేసుకున్నాడ‌ని, ఈ విష‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏదేమైన కొత్త జీవితం మొద‌లు పెట్టిన ప్ర‌భుదేవాకు ఇటు ఫ్యాన్స్ అటు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుదేవాకు ముగ్గురు పిల్లలు ఉండ‌గా, 2008 లో తమ పెద్ద కుమారుడు బ్రెయిన్ క్యాన్సర్ తో చనిపోయాడు. కెరీర్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం స‌ల్మాన్ హీరోగా `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం 2009 బ్లాక్ బస్టర్ వాంటెడ్ కి సీక్వెల్ గా రూపొందుతుంది.