ప్రభాస్ కోపం చాలా భయంకరంగా ఉంటుంది… ప్రభాస్ సీక్రెట్ బయటపెట్టిన ప్రభాస్ శ్రీను..?

ఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ ల ద్వారా పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు. ఇక బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో ఆ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ గురించి ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శీను ఇటీవల ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా పాపులర్ అయిన ప్రభాస్ శీను ఎన్నో సినిమాలలో కమీడియన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రభాస్ శీను ఇండస్ట్రీలో ఇంత గుర్తింపు పొందటానికి కారణం ప్రభాస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం. ప్రభాస్ తో ప్రభాస్ శీను కి మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రభాస్ కుటుంబ సభ్యులందరూ ప్రభాస్ ని రాజు అంటే ప్రభాస్ శ్రీను మంత్రి అని పిలిచేవారు. ఇలా ప్రభాస్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న శ్రీను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రభాస్ గురించి అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ… ప్రభాస్ హీరో అవ్వకముందు ఎలా ఉన్నాడో… పాన్ ఇండియా హీరో అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడని చెప్పుకొచ్చాడు.

పాన్ ఇండియా హీరోగా ఎంత పాపులర్ అయిన కూడా ప్రభాస్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని .. అదే అతనిలో ఉండే గొప్ప లక్షణం అని ప్రభాస్ ని పొగడ్తలతో ముంచేశాడు. ఇమేజ్ పెరిగేకొద్దీ మారాలనే తపన అతనిలో లేదని ప్రభాస్ శీను తెలిపాడు. ఇక ఈ ఇంటవ్యూలో ప్రభాస్ బలం , బలహీనత గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రభాస్ బలం, బలహీనత గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ మంచితనమే అతనికి బలం. అలాగే కొన్ని సందర్భాలలో అతని మంచితనే అతని బలహీత అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ కోపం చాలా భయంకరమైనదని…ఆయనకి ఎవరి మీదైన కోపం వస్తే వాళ్ళతో మాట్లాడడు. ప్రభాస్ నవ్వు ఎంత బాగుంటుందో.. అతని సైలెన్స్ అంత భయంకరంగా ఉంటుందని ప్రభాస్ సీక్రెట్స్ బయటపెట్టాడు.