“ఆదిపురుష్” – ప్రభాస్ క్లారిటీ గానే ఉన్నాడు కానీ..!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు కూడా ఉన్నాయి. కాగా ఈ సినిమాల్లో ఆల్రెడీ జూన్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల్లో తన మొదటి బాలీవుడ్ సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి.

బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఈ సినిమాలో శ్రీరాముని పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ కృతి సనన్ అయితే సీతగా నటించింది. మరి ఈ భారీ సినిమా విషయంలో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో అయితే ప్రభాస్ క్లారిటీ గా ఉన్నాడట.

ఈసారి సినిమా అనుకున్నట్టుగానే జూన్ 16 నే రిలీజ్ అయ్యి తీరాలి ఇందులో ఎలాంటి డిలే ఉండకూడదు అని అయితే చిత్ర యూనిట్ కి స్ట్రిక్ట్ గా చెప్పేశాడట. కానీ చిత్ర యూనిట్ అయితే అసలు సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా ఉన్నారట. సినిమా ప్రమోషన్స్ ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కూడా వారు ఇంకా ఓ కొలిక్కి రాలేకపోతున్నారట.

దీనితో ఈ ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తుంది. దీనితో ఆదిపురుష్ విషయంలో సస్పెన్స్ నెలకొంది. కాగా ఈ సినిమా సుమారు 600 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కగా ఇప్పుడు ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని సాధ్యమైనన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.