Prabhas : మళ్ళీ మాస్ హీరో అవుతానంటున్న డార్లింగ్..!

Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న రెబెల్ స్టార్ తర్వాత మంచి హిట్ ను అందుకోలేక పోయాడు. సాహో సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయి పరాజయం పాలైంది.ఇక కరోన లాక్ డౌన్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన చిత్రం కుడా ఆశించినంత విజయం సాధించలేదు.

రాధే శ్యామ్ సినిమా ను భారీ బడ్జెట్ తో అద్భుతమైన గ్రాఫిక్స్ తో చిత్రికరించారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల మనసు దోచుకోలేదు. ఇక ప్రభాస్ లుక్స్ మీద కూడా నెగెటివ్ కామెంట్స్ రావడం తో ప్రభాస్ ఇపుడు ఆలోచనలో పడ్డాడు.ఇక ప్రభాస్ రాధే శ్యామ్ తర్వాత చేస్తున్న చిత్రాలు కూడా భాయి బడ్జెట్ తో తేరాకెక్కుతున్నవే ఆదిపురుష్ చాలా వరకు గ్రాఫిక్స్ తో సాగే సినిమా గా ఇప్పటికే దర్శకుడు ప్రకటించాడు.

ఇక సలార్ మూవీ కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సాగే భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ , సారా ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక రాధే శ్యామ్ మిగిల్చిన చేదనుభవాలా దృష్ట్యా ప్రభాస్ తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమా చేయాలనీ భావిస్తున్నారట. కమర్షియల్. మాస్ ఫిల్మ్ చేయాలనీ అనుకుంటున్నారట. ఈ మధ్య కాలం లో ఉత్తరాది ప్రేక్షకులకు తెలుగు మాస్ సినిమాల పై బాగానే క్రేజ్ పెరిగింది. అందుకే ప్రభాస్ ఒక మాస్ మసాలా సినిమా తీయాలనీ అనుకుంటున్నారట. ఇక మారుతీ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం తక్కువ బడ్జెట్ లో మాస్ కమర్షియల్ సినిమా కాబోతోందన్నమాట. ఇక ప్రభాస్ అభిమానులకు పండగే