Prabhas : సలార్ కోసం ఆ మలయాళం హీరోనే కావాలంటున్న డార్లింగ్.. నేరుగా రంగంలోకి దిగిన ప్రభాస్…!

Prabhas: రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మరొక చిత్రం సలార్.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిమానుల్లో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. కెజిఫ్ 2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం మీద అంచనాలు ఎలా పెరిగాయో అందరికి తెలిసిందే. అందుకే సలార్ సినిమా మీద అభిమానుల అంచనాలు తారస్తాయి లో వున్నాయ్.

అయితే సలార్ లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను చిత్ర బృందం ఖాయం చేసుకుంది. పృథ్వి రాజ్ కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తనకున్న అనుబంధం వల్ల సలార్ మూవీ కి ఓకే చెప్పేశాడు, కానీ కరోనా సంక్షోభం వల్ల సలార్ సినిమా షూటింగ్ ఆగిపోవడం తో పృథ్వీ రాజ్ కూడా వేరే సినిమాలకు కమిట్ అయ్యారట.ఇప్పుడు సలార్ కోసం డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో మూవీ ని వదులుకోవడానికి పృథ్వీరాజ్ నిర్ణయించుకున్నాడు.

కానీ సలార్ మూవీ లోని ఆ కీలక పాత్రకు పృథ్వీరాజే సరైనవాడని ప్రభాస్ సహా చిత్ర బృందం బలంగా నమ్ముతోంది, ఈ నేపథ్యంలో ప్రభాస్,దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి వెళ్లి పృథ్వీరాజ్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ ను మళ్ళీ సలార్ లో నటించేలా ఒప్పించినట్లు కూడా తెలుస్తోంది, పృథ్వీరాజ్ కొత్త ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు ఆగుతామని కూడా పృథ్వీరాజ్ కు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది, ఇలా సలార్ మూవీ లో పృథ్విరాజ్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఐతే సాలర్ సినిమా ఇప్పటికి 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్ లు విడుదల చేసింది చిత్రబృందం.వీటికి అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. అంతేకాకుండా సినిమా మీద అంచనాలు పెంచేసాయి.