ప్రభాస్.. అందుకోసం మళ్ళీ విదేశాలకు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత గ్యాప్ ఇవ్వకుండా పాన్ ఇండియా సినిమాలుసి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ ని మెప్పించలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది.

సలార్ సిరీస్ లో మొదటి భాగం సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ ని ప్రభాస్ కి ఇస్తాడని నమ్మకంగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం పూర్తి చేయడంపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారంట.

డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయిన చాలా కాలంగా మోకాలి నొప్పికి సర్జరీ చేయించుకోనున్నారంట. సలార్ షూటింగ్ సమయంలోనే ప్రభాస్ కాలికి గాయం అయ్యింది. అయితే బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ కారణంగా దానికి సర్జరీ చేయించుకోలేదు. ఇప్పుడు సలార్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆఖరుకి వచ్చేసాయి. అలాగే కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ కూడా చివరి దశకి వచ్చేసింది.

వీటి పనులు పూర్తయిన వెంటనే సర్జరీ చేసుకోవాలని డార్లింగ్ నిర్ణయించుకున్నారు. అది ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ లేదు. కల్కి 2898 ఏడీ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ సమయానికి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదంట. ఈ నేపథ్యంలో వేసవిలో మరో డేట్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలు పూర్తయితే సలార్ పార్ట్ 2 షూటింగ్ ని వచ్చే ఏడాది ఆరంభంలో కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. తరువాత సందీప్ రెడీ వంగా దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు సందీప్ రెడ్డి కూడా యానిమల్ సినిమాని రిలీజ్ చేసి స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ చేయనున్నారు.