ఇద్దరు మెగా హీరోస్ కీ ఎసరు పెట్టిన ప్రభాస్.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా ప్రాజెక్ట్ కే నుంచి నిన్న మహా శివరాత్రి కానుకగా అయితే మాసివ్ అప్డేట్ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె హీరోయిన్ గా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేయడంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పరిస్థితులు అయితే మారాయి. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ఫిక్స్ కాగా మెయిన్ గా మెగా హీరోస్ ఇద్దరికి ప్రభాస్ ఎసరు పెట్టినట్టుగా తెలుస్తుంది.

ప్రభాస్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కానీ ఇదే రేస్ లో పాన్ ఇండియా హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు నటిస్తున్న చిత్రాలు కూడా రావచ్చని గట్టి టాక్ ఉంది. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ కే అనౌన్సమెంట్ తో అయితే ఒక్కసారిగా ఇది మారిందట.

దీనితో ఆల్రెడీ పుష్ప పార్ట్ 2 ని మార్చ్ కి మార్చగా చరణ్ శంకర్ ల భారీ సినిమా కూడా ఇదే ప్లాన్ లో ఉందట. సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లు ఉన్నప్పటికీ ఎందుకు రిస్క్ అని సినిమాని అయితే వచ్చే ఏడాది వేసవి రేస్ కి షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ప్రభాస్ అనౌన్సమెంట్ ఇద్దరు మెగా హీరోస్ సినిమాలు ఆగేలా చేసింది.