Prabhas : రీమేక్ మీద నమ్మకం పెట్టుకున్న డార్లింగ్…!

 

Prabhas: ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. అభిమానులు ప్రభాస్ నుంచి మాస్ ఎంటర్టైనర్ని ఆశిస్తున్నారు. కాగా రాధేశ్యామ్ సినిమా స్లో లవ్స్టోరీగా రావడంతో అభిమానుల అంతగా ఆదరించ లేకపోయారు. ప్రస్తుతం అభిమానుల చూపులు అంతా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా పైనే ఉన్నాయి. సలార్ తర్వాత బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ సినిమా తీయబోతున్న ప్రభాస్.

పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వరుసగా రెండు సినిమాలు విడుదల చేసిన ప్రభాస్ రెండు సినిమాలతోనే ప్రేక్షకులు మెప్పించలేకపోయాడు. దాంతో ఇప్పుడు ఇమిడియెట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితులలో ఉన్నాడు.కాగా ఇప్పుడు ప్రభాస్ తీయబోయే రెండు సినిమాలు కూడా ఆసక్తికర సినిమాలే. ఇదికాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కె చిత్రంలో కూడా నటిస్తున్నారు. సైంటిఫిక్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

ఇవన్నీ ఇలా ఉండగా ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఒక చిన్న సినిమాని తీసి ఇమిడియట్ గా ఒక గిఫ్ట్ ని కొట్టాలి అని ఆలోచిస్తున్నారు. ఈ సినిమా పేరు డీలక్స్ రాజా అని ఖరారు చేశారు. ఎంత వీలైతే అంత తొందరగా ఈ సినిమాను తెరకెక్కించి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. నీకోసం ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్ ని కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. కాగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది రీమేక్ చిత్రమా కాదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయం మీద చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. కానీ ప్రభాస్ ఆశలన్నీ మారుతి దర్శకత్వంలో ఉన్న ఈ చిన్న సినిమా మీదనే ఉన్నాయట