ప్రభాస్ ఫ్యాన్స్ ఈ జన్మకి ఇది చాలు అంటున్నారు..!

ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ సినిమాను చిత్రీకరించబోతున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికే అధికారకంగా వెల్లడించాడు. ప్రభాస్ నుంచి అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఆదిపురుష్ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తానాజీ లాంటి చారిత్రాత్మక సినిమా తర్వాత ఓం రౌత్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అందులో మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండటం తో యావత్ తెలుగు ప్రేక్షకుల కళ్ళన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి.

ఇక రావణాసూరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రభాస్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ పోస్టర్స్ ని రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమాలో నటించే సీత ఎవరన్నది, ఆ పాత్ర లుక్ ఎలా ఉంటుందన్నది అందరిలో పెరిగిన ఆసక్తి. ఇక ఈ రోజు నుండి మోషన్ క్యాప్చర్ షూట్ ను మొదలు పెట్టినట్లుగా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించాడు. యానిమేషన్ క్యారెక్టర్స్ కు మోషన్ క్యాప్సర్ ద్వారా మూమెంట్ ఇస్తారు. ప్రస్తుతం దర్శకుడు ఓం రౌత్ ఆ పనులు ప్రారంభించాడు. ఈ సినిమాలో ఒరిజినల్ షాట్స్ కంటే వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉంటాయని ఓం రౌత్ ముందునుంచి క్లియర్ గా చెబుతున్నాడు.

అందుకే ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గ్రీన్ మ్యాట్ సెట్స్ ని నిర్మించారు. ఈ స్టూడియోస్ లోనే ముందుగా మోషన్ క్యాప్చర్ షాట్స్ ను మొదలు పెట్టారు. కాగా ఆది పురుష్ సినిమా లోని వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మెజార్టీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే కృతి సనన్ ని ఫైనల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలోనే సీత పాత్రలో నటించే హీరోయిన్ ని రివీల్ చేయనున్నారట. ఇక ఆది పురుష్ సినిమాను విజువల్ వండర్ గా తయారు కాబోతోంది. 2022 ఆగస్టు 11న సినిమాను విడుదల చేయబోతున్నట్టు కూడా మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.