రాధే శ్యామ్ : ఈ విషయం తెలిస్తే ప్రభాస్ కి ఫ్యాన్స్ పాలాభిషేం చేస్తారు ..!

రాధే శ్యామ్ : ప్రభాస్ కెరీర్ లో తెరకెక్కుతున్న 20వ సినిమా. ఈ సినిమాకి రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. 250 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా యూవీ క్రియేషన్స్.. గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రాధేశ్యామ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు రాధేశ్యామ్ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ సస్పెన్స్ ని మేయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని సినిమాల రిలీజ్ డేట్ వచ్చేసింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ రిలీజ్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ సినిమా టీజర్.. ట్రైలర్ విషయంలో కూడా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటి రావడం లేదు. ప్రభాస్ నుంచి సాహో వచ్చి రెండేళ్ళు దాటిపోవడంతో రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే వాస్తవంగా రాధేశ్యామ్ జూలై 12 న రిలీజ్ అన్న టాక్ వినిపించింది. అయితే అది మరీ లాంగ్ అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. కాకా పోతే సర్ప్రైజింగ్ న్యూస్ రివీల్ చేయడానికి కాస్త సమయం పడుతుందట.

ఈ క్రమంలోనే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఇప్పటికే రాధేశ్యామ్ థియేట్రికల్ బిజినెస్ సైలెంట్ గా జరిగిపోతుందట. రికార్డ్ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు ప్రాంతాలలో రాధేశ్యామ్ బిజినెస్ సైలెంట్ గా జరిగినట్టు సమాచారం. దాదాపు అన్ని ఏరియాల్లో ఇప్పటికే మంచి ఫ్యాన్సీ రేట్లకే థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక త్వరలో రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సలార్ సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.