Prabhas : రాధే శ్యామ్ లో ప్రభాస్ లుక్ కోసం కోట్లు ఖర్చు చేశారట చిత్ర యూనిట్..!

Prabhas: రాధే శ్యామ్ సినిమా కోసం ప్రభాస్ ప్రేక్షకులు బాగానే ఎదురుచూశారు. అయితే సినిమా విడుదలయ్యాక మిశ్రమ స్పందన వచ్చింది. అయితే సినిమాలో ప్రభాస్ లుక్ గురించి చాలా చర్చే జరిగింది. సాహో సినిమా తర్వాత రాధే శ్యామ్ కు చాలా గ్యాప్ రావడంతో ప్రభాస్ కొంచెం లావు పెరగడంతో షేప్ అవుట్ అయ్యాడు. ఇక సినిమా పాత్రకు తగ్గట్టు కనిపించలేదు.

ఇక అప్పటికే సినిమా కరోనా కారణంగా చాలా జాప్యం జరగడం వల్ల బడ్జెట్ పెరుగుతుందని ప్రభాస్ సన్నబడటం మీద దృష్టి పెట్టలేదు.దీంతో చేసేదేమి లేక డైరెక్టర్ గ్రాఫిక్స్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం ప్రభాస్ లుక్ కోసం దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టారట చిత్ర యూనిట్. అయితే క్లోజ్ అప్ షాట్స్ లో ప్రభాస్ లుక్ లో తేడా బాగా కనిపిస్తోంది. సినిమాలో ప్రభాస్ లుక్ పై అభిమానులు సంతృప్తితో లేరు.

తన తదుపరి చిత్రం కోసమైనా ప్రభాస్ తన అందం పై దృష్టి పెడితే బాగుంటుందని ఆశిస్తున్నారు. తన శరీర దారుడ్యం పై కాస్త దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. ఇక రాధే శ్యామ్ సినిమా లో ప్రభాస్ కు తల్లి గా నటించినా భాగ్యశ్రీ నటించారు. ఈ విషయం పై కూడా చాలా చర్చే సాగింది అయితే అది బాలీవుడ్ లో జరిగింది. ప్రభాస్ కు భాగ్యశ్రీ బాగోలేదని కామెంట్ చేస్తున్నారు. భాగ్యశ్రీ ప్రభాస్ చెల్లి లా ఉండంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటించింది. కృష్ణం రాజు, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. సినిమా కోసం 350 కోట్లు ఖర్చు చేసారట. ఇక ప్రభాస్‌ ఎప్పటికైనా మేల్కొని తన ఫిట్‌నెస్ మీద దృష్టి పెడతాడేమో చూడాలి మరీ.