షాకింగ్ : ప్రభాస్ ఫ్యాన్స్ ఓవరాక్షన్ తో థియేటర్స్ కి భారీ నష్టం 

మిగతా సినీ పరిశ్రమలో ఏమో కానీ మన తెలుగు ఇండస్ట్రీ లో మాత్రం మూవీ లవర్స్ చాలా మంది ఉంటారు. అయితే టాలీవుడ్ లో అలా గత ఏడాది స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ లో ఇప్పటికి అనేక చిత్రాలు రాగా ఈ చిత్రాల లిస్ట్ లో అయితే పలు ప్లాప్ చిత్రాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి.

మరి ఇదిలా ఉండగా పెద్దగా ఎలాంటి అకేషన్ కూడా లేకుండా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్లాప్ చిత్రం “యోగి” చిత్రం నిన్న థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో అయితే విడుదల అయ్యింది. అయితే ఆసక్తికరంగా ఈ చిత్రానికి పెద్దగా రెస్పాన్స్ ఉండదు అనుకుంటే దీనితో అనుకోని రేంజ్ రెస్పాన్స్ ని ఫ్యాన్స్ అందించారు.

మరి చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ లో భారీ రెస్పాన్స్ కూడా రాగా ఈ రెస్పాన్స్ తో పాటుగా థియేటర్స్ యజమానులకు భారీ నష్టాలు కూడా మిగిల్చారు వారు. అయితే ఇది వరకు కూడా ఇతర హీరోల ఫ్యాన్స్ ఇలాంటి నష్టాలు చేశారు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రీతిలో అయితే చేయలేదు.

వీళ్ళు ఏకంగా థియేటర్స్ స్క్రీన్స్ చించేశారు. అలాగే లోపల కుర్చీలని ధ్వంసం చేయడం ఇంకా స్క్రీన్ దగ్గరకి వెళ్లొద్దు అన్నందుకు థియేటర్లు యాజమాన్యంతో గొడవలు తాగేసి థియేటర్స్ బయట సామాన్లు పగలగొట్టడం ఇలా మొత్తం పెద్ద రచ్చ చేసి పారేసారు.

దీనితో థియేటర్స్ యజమానులకు ఈ రీ రిలీజ్ ల మూలాన భారీ నష్టాలు ఇప్పుడు వచ్చాయి. దీనితో ఇక చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వారు తాము ఎలాంటి సినిమా రీ రిలీజ్ చేయబోము అని చెప్పేస్తున్నారట. వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేయడం మానేసి ఇంత ఓవరాక్షన్ చేస్తే ఇక ఫైనల్ రిజల్ట్ ఇలాగే ఉంటుంది.