గోపిచంద్ అప్డేట్ ఇస్తే.. ప్రభాస్‌ను తగులుకున్నారే..?

Beats Of Radhe Shyam motion poster released

గోపీచంద్ చాలా రోజుల తరువాత ఒక మంచి దర్శకుడి దృష్టిలో పడ్డాడు. కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రకాల హిట్స్ అందుకున్న డైరెక్టర్ మారుతితో సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా అప్డేట్ ఇచ్చారో లేదో యువీ క్రియేషన్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నెటిజన్లు ఏ స్థాయిలో గుర్రుగా ఉన్నారో సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. గతంలో ఎన్నోసార్లు లేట్ గా అప్డేట్స్ ఇచ్చారని ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సాహో సినిమా నుంచి ఈ సంస్థ చేస్తున్న ఆలస్యం అంతా ఇంతా కాదు. నమ్మకం పెట్టుకున్న ప్రతిసారి నిరాశపరుస్తున్నట్లు ఈజీగా అర్ధమవుతోంది.

రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ అప్డేట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు యూవీ క్రియేషన్స్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. వారు సోషల్ మీడియాలో ఎలాంటి ఎనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్ లలో ఎక్కువగా రాధేశ్యామ్ అప్డేట్ కావాలని కోరుతున్నారు. రీసెంట్ గా మారుతి, గోపిచంద్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వగా ముందు రాధేశ్యామ్ టీజర్ అప్డేట్ ఇవ్వండి అంటూ ఒక రేంజ్ లో తగులుకున్నారు. మరి యూవీ క్రియేషన్స్ ఆ కామెంట్స్ కు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.