KGF 2: రాకీ భాయ్ కోసం సలార్… కేజీఎఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్..!

KGF 2:కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రశాంత్ నీల్, 2014వ సంవత్సరంలో ఉగ్రం సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. 2018లో యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ చాప్టర్1 సినిమా ను చిత్రీకరించారు. ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచిపోయింది. కే జి ఎఫ్ చాప్టర్ వన్ విజయం తర్వాత ప్రశాంత్ నీల్ కు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ వన్ కు సీక్వెల్ గా వస్తున్న కే జి ఎఫ్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది.

భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మరోసారి బాక్సాఫీస్ దాడి చేయబోతున్నాడు హీరో యష్. ఎంతో ప్రతిష్టాత్మకంగా హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు.  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.

విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరపాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. దీనికి ముఖ్య అతిథిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను తీసుకురావాలని ఆలోచిస్తున్నారట.ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తుండగా, ఈ క్రమంలోనే ఆయనని కేజీఎఫ్ 2 ఈవెంట్‌కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ వేడుకకు సంబంధించిన అధికారిక వస్తే ఇది ఎంత వరకు నిజం అన్నది తెలుస్తుంది.ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.