ప్ర‌భాస్‌ని హైద‌రాబాద్‌లో కలుస్తాన‌న్న హీరోయిన్‌.. ఎందుకో చెప్పాలంటూ నెటిజ‌న్స్ ట్వీట్స్

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధే శ్యామ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం ఇటలీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ మేక‌ర్స్ చిత్ర షూటింగ్ జ‌రుపుతున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే లాక్‌డౌన్ త‌ర్వాత గ‌త నెల నుండి షూటింగ్ జ‌రుపుకుంటున్న రాధేశ్యామ్ చిత్ర‌ తాజా షెడ్యూల్ కోసం కథానాయిక పూజా హెగ్డే కూడా ఇటీవ‌ల ఇట‌లీకి వెళ్ళింది. సుమారు నెల రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న ఈ అమ్మడు రీసెంట్‌గా తిరిగి భార‌త్‌కు వ‌చ్చింది.

ఇట‌లీలో త‌న పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తైన‌ట్టు చెప్పుకొచ్చిన పూజా హెగ్డే..ఈ షెడ్యూల్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన టీమ్‌కు ధ‌న్య‌వాదాలు అని పేర్కొంది. అలానే ప్ర‌భాస్ మ‌నం హైద‌రాబాద్‌లో క‌లుద్దాం అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్‌కి స్పందించిన నెటిజ‌న్స్ ఇన్నాళ్ళు ప్ర‌భాస్‌తోనే ఉన్నావు. మ‌ళ్ళీ హైద‌రాబాద్‌లో క‌లిసి ఏం చేస్తావు అంటూ సెటైరిక‌ల్‌గా స్పందిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్రం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌నున్నారు.

రాధే శ్యామ్ చిత్రంలో సీనియ‌ర్ న‌టి భాగ్య శ్రీ కూడా న‌టిస్తున్నారు. తాజాగా ఈవిడ ప్ర‌భాస్ త‌న‌ని ఎంత బాగా చూసుకున్నాడో వివ‌రించారు. నా కోసం హైదరాబాదీ స్వీట్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. నేను తినేందుకు 15 రకాల వంటలను టేబుల్‌పై పెట్టేవారు. ప్ర‌భాస్ చాలా ఫ్రెండ్లీ ప‌ర్సన్ అని అన్నారు. చిత్రంలో సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధేశ్యామ్ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.