పాయల్ రాజ్పుత్.. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో యువతను తన వైపుకు తిప్పుకుంది. ఇప్పటికీ ఇందు పాత్రను ఎవ్వరూ మరిచిపోలేక పోతున్నారు. అంతలా ప్రభావితం చేసేసింది పాయల్ రాజ్పుత్. ఇక ఆ తరువాత ఆర్డీఎక్స్ లవ్, డిస్కోరాజా, వెంకీమామ వంటి చిత్రాలు చేసినా సరే ఇందు హ్యాంగ్ ఓవర్ మాత్రం తగ్గడం లేదు. అందుకే ఇంత వరకు మరో సరైన హిట్ పడకపోయినా పాయల్కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు.
పాయల్ రాజ్పుత్ లాక్డౌన్లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. పిల్లో చాలెంజ్ అంటూ ఓ దిండును అందాలకు అడ్డుపెట్టి నగ్నంగా పోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు నెట్టింట్లో కుంపటిని పెట్టేశాయి. ఆపై వెరైటీగా పేపర్ డ్రెస్సులు ధరించింది. ఇలా లాక్ డౌన్లో రచ్చ రచ్చ చేసిన పాయల్ బాగానే లాగించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బాగా బొద్దుగా, లావుగా తయారైనట్టుంది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా పాయలే తెలిపింది.
లాక్ డౌన్లో భారీగా బరువు పెరిగానని చెప్పుకొచ్చింది. మామూలుగా అమ్మాయిలు వయసు, బరువు చెప్పడానికి సిగ్గుపడతా. బయటకు చెప్పరు అలాంటి విషయాలు. కానీ పాయల్ మాత్రం ఎలాంటి సిగ్గు మొహమాటం లేకుండా గ్రాములతో సహా చెప్పేసింది. లాక్డౌన్లో బాగా తినడం వల్ల.. 62 కేజీల వరకు పెరిగానని మళ్లీ 58.5 కేజీలకు తగ్గానని, టార్గెట్ 53 కేజీలు అని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది. అయితే చాలా కష్టమని అయినా ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది.