పాయల్ రాజ్పుత్ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆర్ ఎక్స్ 100 అనే ఒక్క సినిమాతోనే పాయల్ మాయలో పడిపోయారు. ఇందు పాత్రలో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది పాయల్. ఆపై వరుసగా చిత్రాలను చేసినా కానీ ఆమెకు పేరును తీసుకురాలేకపోయాయి. డిస్కోరాజాలో పర్లేదు అనిపించుకుంది కానీ సినిమా దెబ్బేసింది. వెంకీమామ సినిమా హిట్ అయింది కానీ ఆమె క్యారెక్టర్ తేడా కొట్టేసింది.
ఇలా ఆర్ ఎక్స్ 100 తరువాత ఏ చిత్రం కూడా తనకు మళ్లీ ఆ రేంజ్ నేమ్, ఫేమ్, క్రేజ్ను తీసుకురాలేకపోయాయి. ఇక ఇన్ని రోజులు లాక్ డౌన్ అంటూ ఇంటి పట్టునే ఉన్న పాయల్ ప్రస్తుతం షూటింగ్లతో బిజీగా గడిపేందుకు సిద్దమవుతోంది. ఈ మధ్యే ఓ ప్రభుత్వ యాడ్లో నటించింది. అందుకోసం మొదటి సారి తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేసిందిట. ఇకపై తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పాలని కూడా నిర్ణయించుకుందట.
తాజాగా పాయల్ హైద్రాబాద్ రోడ్ల మీద రచ్చ చేసింది. ఓ వైపు వాతావరణం చల్లగా ఉండి వర్షం కురుస్తూ ఉంటే.. పాయల్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రోడ్డు పక్కనే మెట్రో స్టేషన్ వద్ద ఫోటో షూట్లు చేసేసుకుంటుంది. కరోనా కాబట్టి జనాలెవ్వరూ తిరగడం లేదేమో గానీ.. అదే పాయల్ వచ్చిందని తెలిస్తే.. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక పాయల్ను సెల్ఫీల కోసం చుట్టుముట్టేయరూ. ఏది ఏమైనా పాయల్ది మాత్రం ధైర్యమని చెప్పుకోవాలి.