ప్రియుడితో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న పాయల్.. ఏకంగా ఫోటోలకు అలాంటి ఫోజులిస్తూ!

ఆర్ ఎక్స్ 100 చిత్రాల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎన్నో బోర్డ్ సీన్స్ లో నటించి కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు సోషల్ మీడియాలో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ పెరగడమే కాకుండా పలు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా పలు సినిమాలతోను సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉండే పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

అయితే పాయల్ సౌరబ్ థింగ్రాతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు చేసే రచ్చ ఓ రేంజ్లో ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా పాయల్ అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళిన ఏదైనా పార్టీలకు వెళ్ళిన లేదా పబ్ కి వెళ్లిన తన వెంట సౌరబ్ దర్శనమిస్తాడు. ఇక కరోనా సమయంలో సౌరబ్ తల్లి కరోనాతో మృతి చెందినప్పుడు పాయల్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో తన ప్రియుడి దగ్గరే ఉంటూ అతనిని ఓదార్చింది.

ఇలా వీరిద్దరూ జంటగా సోషల్ మీడియాలో కూడా ఎంతో రచ్చ చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా పాయల్ ప్రియుడు సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఇందులో తను పాయల్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తూ మత్తు కళ్ళతో చూస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సరదాలు సరసాలు ఇంట్లో చేసుకోండి అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.