ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించన నాకు మాత్రమే తెలుసు ..?

ముకుంద, ఒక లైలాకోసం సినిమాలతో తెలుగు సినిమాలలో గుర్తింపు పొందిన పూజా హెగ్డే ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్‌’ లాంటి సూపర్ హిట్స్ సినిమాలలో నటించే అవకాశం అందుకొని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యాం, అలాగే అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు చేస్తుంది.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

కాగా పూజా హెగ్డే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌రోష‌న్ నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. అప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేసి హిట్ అందుకొని ఉండటంతో పూజా కి వరసగా అవకాశాలు వచ్చాయి. కాని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలన్న క్రేజ్ తో ‘మొహంజోదారో’ చేసింది.

ఈ సినిమా కోసం రెండేళ్ళు కేటాయించింది. అయితే పూజా హెగ్డే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫస్ట్ బాలీవుడ్ సినిమా ‘మొహంజోదారో’ భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఫస్ట్ సినిమానే ఇలా డిజాస్టర్ అయిందా అని తెగ ఫీలైందట. ఎలాంటి కామెంట్స్ వస్తాయో.. అనుకొని ఇక బాలీవుడ్ సినిమాలలో ఛాన్స్ వస్తుందో లేదో అన్న డైలమాలోనే చాలా కాలం ఉందట.

Mohenjo Daro' grosses 100 crore mark worldwide- Business News

కాని అనూహ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఉండగానే బాలీవుడ్ లో హౌస్‌ఫుల్ 4 సినిమా చేసి మంచి స‌క్సెస్ అందుకుంది. దాంతో వరసగా మళ్ళీ బాలీవుడ్ సినిమాలు అది కూడా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ లతో నటించే అవకాశం అందుకుంది. అయితే పూజా నటించిన మొద‌టి సినిమా ‘మొహంజోదారో’ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అవడంతో ఎంతో బాధ పడ్డానని ఆ బాధ పడ్డ వాళ్ళకే తెలుస్తుందని చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇప్పుడు టాలీవుడ్ కంటే బాలీవుడ్ సినిమాలలోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటుంది.