పాఫం ఆ డైరెక్టరు.! ఎవరూ పట్టించుకోరేం.!

తమిళ హీరో విజయ్‌తో ‘వారసుడు’ సినిమా తెరకెక్కించాడు వంశీ పైడిపల్లి. టాలీవుడ్ హీరోలెవరూ పట్టించుకోకపోవడంతో చెన్నయ్‌కి చెక్కేయాల్సి వచ్చిందంటూ అప్పట్లో వంశీ మీద సెటైర్లు పడ్డాయ్ కూడా.

‘వారసుడు’ సినిమా విషయానికొస్తే, అది కాస్తా అటూ ఇటూగా అయ్యింది. తమిళంలో ఓకే అనిపించుకుందిగానీ, తెలుగులో ఫ్లాప్. దాంతో, వంశీ పరిస్థితి గందరగోళంగా మారింది.

టాలీవుడ్‌లో వంశీ వైపు ఏ హీరో కూడా చూడట్లేదు. ‘వారసుడు’ తర్వాత మరో సినిమా చేద్దామని అప్పట్లో వంశీకి భరోజా ఇచ్చిన విజయ్, ఆ తర్వాత లైట్ తీసుకున్నాడట.

ఓ యంగ్ హీరోతో సినిమా చేయడం కోసం వంశీ సమాయత్తమవుతున్నాడట. కానీ, సహజంగా బడ్జెట్ యాంగిల్‌లో భారీతనం చూపే వంశీకి, సరైన నిర్మాత దొరకని పరిస్థితి వుందట.