డే 9 – బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వని “విరూపాక్ష” వసూళ్లు.!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన చిత్రం “విరూపాక్ష” పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా రాణించకపోవడంతో అయితే ఈ సినిమా కి అడ్డు లేకుండా పోయింది.

కాగా ఈ చిత్రం అయితే మొదటి వారంలోనే 60 కోట్ల గ్రాస్  మార్క్ ని టచ్ చేసేయగా ఇక ఈ రెండు రోజుల్లో అయితే ఏకంగా మరో 10 కోట్లు అందుకొని 70 కోట్ల గ్రాస్ కి చేరిపోయింది. అయితే ఈ చిత్రం ఈ 9 రోజుల్లో మొత్తం 70 కోట్లు రాబట్టగా ఏపీ తెలంగాణాలో అయితే 28 కోట్లకి పైగా షేర్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా విరూపాక్ష సత్తా చాటుతుందట. ఇక ఈ చిత్రం అయితే అక్కడ 1.5 మిలియన్ మార్క్ కూడా చేరుకుంటుందట. మొత్తానికి అయితే విరూపాక్ష డామినేషన్ గట్టిగానే ఉందని చెప్పాలి.

ఇంకా ఈ సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించగా సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మాణం వహించగా ఇప్పుడు మేకర్స్ విరూపాక్ష ఇతర భాషల రిలీజ్ కి అయితే సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ లోనే బిజీగా ఉన్నారు.