పూజ హెగ్డే తెలివి టాలీవుడ్ లో ఎవరికీ లేదు.. మొత్తానికి అనుకున్నది సాధించింది ..!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తో ఉంది పూజా హెగ్డే. ఇప్పుడు తన చేతిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధే శ్యామ్ ఉంది. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే 15 రోజుల షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళారు. అక్కడ శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చి మిగతా షూటింగ్ మొత్తం సెట్స్ లో కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం భారీ హాస్పిటల్ సెట్ ని కూడా సిద్దం చేశారట.

Pooja Hegde From Radhe Shyam - Photogallery - Page 1

గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతుందని సమాచారం. అంతేకాదు ప్రభాస్ – పూజా హెగ్డే డ్యూయల్ రోల్ లో కనిపిస్తారన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు పూజా బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా పూజా హెగ్డే లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెల్సిందే.

Birthday Posters: Pooja In 'Radhe Shyam' & 'Most Eligible Bachelor' -  Telugu Most Bachelor Hegde As Prerna Radhe Shyam Prabhas Ra-TeluguStop

అలాగే అఖిల్ అక్కినేని సరసన కూడా పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్న సినిమా చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో పాటు ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కబోయో ఎన్.టి.ఆర్ 30 లో కూడా పూజా హెగ్డే ని హీరోయిన్ గా అనుకుంటున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో కూడా పూజా కే హీరోయిన్ గా అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే హరీష్ శంకర్ తెరకెక్కించిన రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించినది పూజా. టాలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్నా కూడా ఎప్పటి నుంచో బాలీవుడ్ లో సెటిలవ్వాలని ట్రై చేస్తోంది. మొత్తానికి అనుకున్నది సాధించింది పూజా. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్, అక్షయ్ కుమార్ ల సినిమాలు చేస్తోంది. అంతేకాదు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయట. సెట్ అయితే ఏ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని వదల వద్దని డిసైడయిందట.