Nitin : పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన నితిన్..!

Nitin : హీరోగా తనదైన మార్క్ సినిమాలతో ఓ వైపు డిస్ట్రిబ్యూషన్ లోనూ కొనసాగిస్తూ సక్సెస్ అవుతున్నాడు హీరో నితిన్. నితిన్ పెళ్లి తర్వాత చేసిన మాస్ట్రో, చెక్ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు రంగ్ దే పర్వాలేదు అనిపించింది. భీష్మ తరువాత మంచి హిట్ నితిన్ అందుకోలేదు అందుకే తన సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు నితిన్.

ఇక తాజాగా నితిన్ తన తదుపరి సినిమా “మాచర్ల నియోజకవర్గం” పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయడానికి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మరెవరో కాదు సాగర్ కే చంద్ర.అయ్యారే” సినిమాతో డైరెక్టర్ గా మారిన సాగర్ కే చంద్ర అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన “భీమ్లా నాయక్” సినిమాకి దర్శకత్వం వహించి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజా సమాచారం ప్రకారం సాగర్ కే చంద్ర ఇప్పుడు నితిన్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన డిస్కషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 14 రీల్స్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తారు.

ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా రాజకీయ నేపథ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్నది.మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు. భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్‌ తో కలిసి పనిచేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ పని చేశారు. ఇక నితిన్ కు జోడిగా కేథరిన్ థెరిసా, కృతి శెట్టి నటిస్తున్నారు.