నిఖిలూ.! ఇది మరీ టూమచ్.!

‘ఇకపై అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే..’ అంటూ తాజాగా యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ప్రకటించాడు. నిఖిల్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ‘స్పై’ సినిమాలో నిఖిల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగానే నిఖిల్ ఆ ప్రకటన చేశాడు. అంతా బాగానే వుంది కానీ, ‘స్సై’ హిట్ అయితే ఓకే. హిట్ అవ్వాలనే కోరుకుంటున్నారంతా. కానీ, తేడా కొట్టిందో కథ మారిపోద్దంతే.

నిఖిల్ వంటి హీరోలు ఇలాంటి ప్రకటనలు చేసే ముందు కాస్త ఆలోచించాలి. ప్యాన్ ఇండియా స్టార్ అనిపించేసుకోవడంతో పోల్చితే, అలా వచ్చిన ఆ ఇమేజ్‌ని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం.

ప్రబాస్ వంటి హీరోల వల్లే కాకపోతోంది. అలాంటప్పుడు నిఖిల్ ఎంతటోడు. అన్ని సినిమాలూ ప్యాన్ ఇండియా సినిమాలే అంటే ఎలా కుదురుతుంది.? ఈ అతే కాస్త తగ్గించుకుంటే మంచిదని నిఖిల్‌కి సన్నిహితులు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట. అసలు ‘ స్సై’ రిలీజ్ విషయంలో గందరగోళానికి కారకుడు కూడా నిఖిలే అన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. జర జాగ్రత్త నిఖిలూ.!