అందరూ బాగుండాలి అందులో నేను పవిత్రం ఉండాలి: నరేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో..నరేష్ , పవిత్ర లోకేష్ వ్యవహారం గురించి పెద్ద రచ్చ జరిగింది. వీరిద్దరి వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా తీవ్ర దుమారాన్ని రేపింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ఎక్కడ చూసినా జంటగా కనిపించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే వీరి వ్యవహారంలోకి నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఎంటర్ అవటం వల్ల అసలు విషయాలు బయటపడ్డాయి. వీరిద్దరూ గత నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నట్లు మీడియా ముఖంగా అంగీకరించారు. అంతేకాకుండా మైసూర్ లో ఒక హోటల్ గదిలో ఇద్దరు కలిసి ఉండగా రమ్య వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది.

ఆ తర్వాత నరేష్ కూడా తన మూడవ భార్య గురించి తీవ్రంగా విమర్శలు చేశాడు. ఆ వివాదం తర్వాత నరేష్, పవిత్ర ఇద్దరు చాలా సైలెంట్ అయ్యి బయట ఎక్కడ కనిపించలేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో మళ్లీ వీరిద్దరూ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా వీరిద్దరూ అలీ హీరోగా నటించిన’అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అని సినిమాలో వీరిద్దరూ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటించారు.

తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ క్రమంలో ఒక వీడియో చేసి..ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ వీరిద్దరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియోలో నరేష్ పవిత్ర భుజాల మీద చేతులు వేసి..” సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది..సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా స్పందిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయని మరోసారి మా సినిమా నిరూపించింది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి” అంటూ నరేష్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.