శ్రీముఖి ఉంటే ప్రశాంతత ఉండదు.. శ్రీముఖిపై నాగబాబు హాట్ కామెంట్స్‌

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఏ రేంజ్‌లో శబ్దాలు చేస్తుందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీగడపకు తెలుసు. పటాస్ షోతో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్న శ్రీముఖి.. బిగ్ బాస్ షోతో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే దాంతో పాటు కొంత నెగెటివిటీని కూడా తెచ్చుకుంది. ఆ విషయాలన్నీ కాసేపు పక్కన పెడదాం. కాంట్రవర్సీలు కాకుండా శ్రీముఖి చేసే అల్లరి గురించి చూద్దాం.

Nagababu Satires On Sreemukhi In Bomma Adhirindi
Nagababu Satires On Sreemukhi In Bomma Adhirindi

బిగ్ బాస్ షోలో లౌడ్ స్పీకర్ అనే అవార్డును సొంతం చేసుకుంది శ్రీముఖి. ఆమె అరుపులకు టీవీ స్పీకర్లు కూడా బద్దలవుతున్నాయని, ఆమె కనిపిస్తే టీవీని మ్యూట్‌లో పెట్టాల్సి వస్తుందని తెగ ట్రోలింగ్ జరిగేది. నాగార్జున సైతం ఆమె అరుపులను కంట్రోల్ చేసుకోమని.. తన ఇంటి వరకు వినిపిస్తోందని కౌంటర్లు వేశాడు. అలా శ్రీముఖిని అందరూ లౌడ్ స్పీకర్ అని ఫన్నీ కామెంట్లు చేసేవారు.

తాజాగా శ్రీముఖి బొమ్మ అదిరింది షోలో యాంకర్‌గా వచ్చింది. అదిరింది షోకు కొన్ని రిపేర్లు చేయడంతో బొమ్మ అదిరిందిగా మారింది. ఇందులో భాగంగా యాంకర్ రవి, భాను శ్రీ స్థానంలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చిన నాగబాబును చూసి శ్రీముఖి.. మీరు వెళ్లి ప్రశాంతంగా కూర్చోండి అని అంటుంది. నువ్ ఉండగా ఇంక ప్రశాంతత ఎక్కడుంటుంది అని నాగబాబు కౌంటర్ వేయడంతో శ్రీముఖి మొహం మాడిపోయింది. సర్ మీరు కూడానా అంటూ సరదాగా నవ్వేసింది.