Nandini Reddy : లేడీ డైరెక్టర్ కి ఓకే చెప్పిన నాగ చైతన్య..!

Nandini Reddy : ఈ ఏడాది అక్కినేని నాగచైతన్య బంగార్రాజుతో సంక్రాంతి కి వచ్చి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. సమంత తో విడాకులు కెరీర్ పై ప్రభావం చూపుతుంది అనుకున్న మునుపటికంటే ఎక్కువ ఉత్సాహంతో సినిమాల్లో బిజీ అయ్యాడు. బంగార్రాజు తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. థాంక్యూ సినిమాతో రానున్నాడు. ఇక థాంక్యూ సినిమా లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక విక్రమ్ కుమార్ తోనే ఒక వెబ్ సిరీస్ కూడా నటిస్తున్నాడు. ఇందులో నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ కు దూత్ అనే పేరును ఖరారు చేసారు. ఇది పూర్తయ్యాక తమిళ దర్శకుడు విక్రమ్ ప్రభుతో ఓ సినిమా అంటూ ఇంతకుముందు ప్రచారం జరిగింది.

నాగచైతన్య మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. సమంత ఓ బేబీ చిత్రాన్ని తెరకెక్కించిన నందినీరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. ఇక డైరెక్టర్ నందిని రెడ్డి గారు సమంతకు బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ముందుగా ఈ కథను నాగచైతన్య-సమంత లతో తెరకెక్కించాలని నందిని రెడ్డి గారు భావించారట.

కానీ వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ ప్రాజెక్టును పోస్ట్ ఫోన్ చేసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. సమంత యశోద, శాకుంతలం సినిమాలతో బిజీ అయిపోయింది. ఇక తాజాగా నందిని రెడ్డి గారు ఈ కథను నాగచైతన్యకు వినిపించిందట. నాగ చైతన్య గారు కూడా వెంటనే ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాను వైజయంతి పిక్చర్స్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తోందట. వెంకట్ ప్రభుతో సినిమా అయిపోయాక ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుందట. ఇక దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.