‘లైన్ మెన్’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్

తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. మార్చి 15న ‘లైన్ మ్యాన్’ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శివ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్ లాంచ్ చేశారు. అనంతరం ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘లైన్ మెన్ పోస్టర్‌లు చూస్తేనే సినిమా చాలా కొత్తగా ఉండబోతోందని అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. మన మూలాల్లోకి వెళ్లి రాసుకునే కథలు, తీసే సినిమాలు ఆడియెన్స్‌కు ఎక్కువగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంటాయి. ఇలాంటి సినిమాను రాసిన, తీసిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రాన్ని ఎంతో నిజాయితీగా తీశారనిపిస్తుంది. అందుకే రియల్ లైన్ మెన్‌లను ఇక్కడకు పిలిచి సత్కరించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలి. ఇలాంటి కొత్త సినిమాలు ఆడితే.. మరి కొంత మంది ముందుకు వస్తారు. త్రిగుణ్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ తన చుట్టూ ఉండే వాళ్లని కంఫర్ట్‌గా ఉంచాలని ప్రయత్నిస్తుంటారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి. త్రిగుణ్ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలవాలి. మార్చి 15న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘తినే ప్రతీ మెతుకు మీద పేరు రాసి ఉంటుందని అంటారు.. ప్రతీ పాత్ర మీద కూడా చేసే వాడి పేరు రాసి ఉంటుంది. మన స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో చిన్న ఉడతలా సాయం చేస్తున్నాను. లేడీస్ లైన్ ఉమెన్‌గా రావడం చూసి.. ఈ సినిమాను చేయాలని అనుకున్నా. కథ సరిగ్గా ఆడలేదు.. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో అన్నీ బూతులే. డబ్బులు బాగా వచ్చాయి. కారు, ఇళ్లు కొనుక్కుని సెటిట్ అయ్యా. కానీ లైన్ మెన్ లాంటి సినిమాలు తీసినప్పుడు రాత్రి పూట ప్రశాంతంగా పడుకుంటాం. ఇప్పుడు సినిమాలకు భాషా సరిహద్దుల్లేవు. లైన్ మెన్‌లు చేస్తున్న సేవలను ఎవ్వరూ గుర్తించడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేశాను. ప్రకాష్ రాజ్ గారు నా మొదటి సినిమాను నిర్మించారు. ఆయనలా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంటుంది. నా కోరిక తీర్చిన నా నిర్మాతలకు థాంక్స్. వంశీ అన్న నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. బి. జయశ్రీ గారు ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్. ఆమెకు పద్మ శ్రీ అవార్డు వచ్చింది. అలాంటి వారు మా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నేను వాళ్లకి తెలుగు నేర్పించాను. వాళ్లు నాకు కన్నడ నేర్పించారు. అలా మా సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో షూట్ చేశాం. మనం ఇప్పుడు ఫోన్, టీవీ వంటి వాటికి బానిసల్లా మారాం. ఓ గంట కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చాం. ఓ ఊర్లో పది రోజులు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథ. లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఒకప్పుడు మా అమ్మ ఉండేది.. ఇప్పుడు లేరు.. సినిమా బిజీల్లో పడి ఎక్కువగా మాట్లాడేవాడ్ని కాదు. జీవితం చాలా చిన్నది.. చాలా విలువైనది. ఇలా ప్రతీది విలువైందే అని సందేశం ఇచ్చే చిత్రమిది. ఓపెనింగ్స్ తెప్పించేంత బలం, బలగం లేదు. కానీ మా కథే మా బలగం. ప్రతీ ఒక్కరూ మా సినిమాకు కనెక్ట్ అవుతారు. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సినిమా కంటెంట్ మారుతోంది. కథే హీరోగా మారింది. ఈ చిత్రం కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. పూర్తిగా పల్లెటూరిలోనే షూట్ చేశారు. త్రిగుణ్ ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

వర్దన్ పేట్ ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు హీరోలను చూసి సినిమాలు చూస్తుండేవారు. కానీ ఇప్పుడు కథలే హీరోగా మారాయి.కొత్త వాళ్లు వస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. లైన్ మెన్ ట్రైలర్ చూశాను. లైన్ మెన్ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. వారి జీవితాన్ని తెరపై తీసుకొస్తున్న హీరో, దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

యతీష్ మాట్లాడుతూ.. ‘లైన్ మెన్ సినిమాను రాయడం, తీయడం ఓ సాహసం. రియల్ లైన్ మెన్‌‌లను చూడటం, వారు పని చేసే విధానాన్ని గమనించి ఈ చిత్రాన్ని రాసుకున్నారు. ఇలాంటి మంచి కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలు గ్లోబల్‌గా రీచ్ అవ్వాలనే మేం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని మేం ఎంకరేజ్ చేస్తుంటాం. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. మానవ సంబంధాలను చూపించాం. మనిషి విలువ, మానవత్వం ఇలా అన్ని యాంగిల్స్‌లో చూపించాం. సినిమాలోని ఎమోషన్‌ను ఆడియెన్స్ ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఇలాంటి కంటెంట్‌ సినిమాలను ఇంకా నిర్మిస్తున్నాం. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

వంశీ మాట్లాడుతూ.. ‘యతీష్, గణేష్ గార్లు ఈ సినిమాకు ప్రధానం. ఈ చిత్రానికి త్రిగుణ్ ప్రాణం పోశారు. లైన్ మెన్ జీవితంలో ఎన్ని ఇబ్బందులుంటాయి.. గ్రామాల్లో వారు జనాలతో ఎంత మమేకం అవుతారు.. అన్నది చాలా చక్కగా చూపించారు. అలాంటి లైన్ మెన్‌లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మంచి సందేశాత్మక చిత్రంగా లైన్ మెన్ రాబోతోంది. మార్చి 15న రాబోతోన్న మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలి’ అని అన్నారు.

గణేష్ పాపన్న మాట్లాడుతూ.. ‘మేం లోకల్ కంటెంట్‌ను గ్లోబల్ ఆడియెన్స్‌కి తీసుకెళ్లాలని అనుకుంటాం. కమర్షియల్ కోసం సినిమాలు చేయం. సబ్జెక్ట్ బేస్డ్ సినిమాలు చేయాలని అనుకుంటాం. ఈ కథ విని త్రిగుణ్ ఈ సినిమాను చేస్తానని అన్నాడు. అయితే ఇది కన్నడలో తీయాలని అనుకున్నాం. కన్నడలోకి వస్తానని త్రిగుణ్ అన్నారు. అప్పుడే ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నాం. ఇది చాలా మంచి కంటెంట్. మంచి కథ ఉంటుంది. లైన్ మెన్ కథ మాత్రమే కాదు.. కరెంట్ పోతే గ్రామాల్లో ఏం జరుగుతుందని చూపించాం. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

వి రఘు శెట్టి మాట్లాడుతూ.. ‘ మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందని చూపించే చిత్రిమిది. ఇండియాలోని ఏదో ఒక ప్రాంతంలో జరిగినట్టు అనిపించదు. ప్రతీ ప్రాంతంలో జరిగిన కథలానే ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎమోషన్స్‌ను ఇంటికి తీసుకెళ్తారు. సినిమాను చూస్తే కంట్లోంచి నీరు వస్తుంది. సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారని మాత్రం చెప్పగలను. ఈ కథను పెద్ద పెద్ద హీరోలకు చెప్పాను. హీరోయిన్ ఉందా? ఫైట్స్ ఉన్నాయా? అని అడిగారు. కానీ త్రిగుణ్ మాత్రం కథ గురించే అడిగారు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఇది ఒక ఊరు కథ. అందులో అందరూ హీరో, హీరోయిన్లే. ఇలాంటి సినిమాను ఒప్పుకోవాలంటే నిర్మాతలకు గట్స్ కావాలి. మార్చి 15న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి’ అని అన్నారు.

మైక్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం డిఫరెంట్స్ కాన్సెప్ట్‌లతో చిత్రాలు వస్తున్నాయి. లైన్ మైన్ కూడా కొత్త పాయింట్‌తో రాబోతోంది. ట్రైలర్ చూస్తుంటే త్రిగుణ్ అద్భుతంగా నటించేశాడనిపిస్తోంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

రాజీవ్ చిత్రా మాట్లాడుతూ.. ‘లైన్ మైన్ అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. పోస్టర్లు, టీజర్, ట్రైలర్ పాటలు అన్నీ బాగున్నాయి. త్రిగుణ్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో చిత్రీకరించారు. మార్చి 15న సినిమా రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

నటీనటులు: త్రిగుణ్, కాజల్ కుందెర్, బి.జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ, మైకో నాగరాజ్, చేతన్ గంధర్వ, దిలీప్ కుమార్, సందీప్ కెంపగౌడ, శ్రీదత్త, సమర్థ్ నర్సింహులు, సుహైల్ రసూల్, గౌరవ్ శెట్టి తదితరులు

సాంకేతిక వర్గం:

రచన, దర్శకత్వం – వి.రఘు శాస్త్రి
నిర్మాణం – పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్
సహ నిర్మాతలు – ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘు శాస్త్రి, భళా స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – గణేష్ పాపన్న
సినిమాటోగ్రపీ – శాంతి సాగర్ హెచ్.జి
ఎడిటర్ – రఘునాథ.ఎల్
మ్యూజిక్ – కాద్రి మణికాంత్
ఆర్ట్ – సూర్య గౌడ
పి.ఆర్.ఒ – వంశీ కాకా, హరీష్ అరసు
పబ్లిసిటీ డిజైన్స్ – రాజ్సో క్రియేటివ్స్
లేబుల్ – సారిగమ ఇండియా లిమిటెడ్, ఏ ఆర్.పి.ఎస్.జి గ్రూప్ కంపెనీ