ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

good news for prabhas fans

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. దర్శకుడిపై నమ్మకమైతే గట్టిగానే ఉంది. ఎందుకంటే. మిగతా వాళ్లల కాకుండా సినిమా అప్డేట్స్ ఇవ్వకపోయినా కూడా ఒక క్లారిటి ఇస్తూ వెళుతున్నాడు.
Nag Ashwin to break all the myths of Prabhas's next?
ప్రభాస్ స్కై ఫై సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇండియన్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ఫుల్ లెన్త్ రోల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఈ సంక్రాంతికి ఇవ్వాలని అనుకున్నారట. అభిమానులు కూడా కొంత నమ్మకంతో ఎదురుచూశారు గాని వర్కౌట్ కాలేదు.

ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చాడు.జనవరి 29న అలాగే ఫిబ్రవరి 26న సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నట్లు చెప్పేశాడు. మొదటి అప్డేట్ లో షూటింగ్ లాంచ్ విషయంలో క్లారిటీ ఇవ్వవచ్చట. ఇక మరొక అప్డేట్ లో అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయంపై క్లారిటీ ఇవ్వవచ్చని తెలుస్తోంది. మరి ఆ అప్డేట్స్ ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.