నాగ్ అశ్విన్ ఇచ్చిన అప్‌డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలొస్తున్నాయట .!

నాగ్ అశ్విన్ ..టాలీవుడ్ లో చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. ఫస్ట్ సినిమా నేచురల్ స్టార్ నాని తో ఎవడే సుబ్రమణ్యం సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్  అంతేకాదు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ – దుల్కర్ సల్మాన్ లతో మహానటి అన్న బయోపిక్ ని తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తో నాగ్ అశ్విన్ దేశ వ్యాప్తంగా దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు.

తెలుగు తో పాటు తమిళ చిత్ర పరిశ్రమ.. అలాగే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఏకంగా మహానటి సినిమా చూసి ఇంటికి పిలిపించుకొని ప్రశంసల జల్లు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి కూడా స్వయంగా మంచి కథ ఉంటే రెడీ చేసుకో మనిద్దరం కలిసి సినిమా చేద్దామని మాటిచ్చారు. దాంతో అందరూ నాగ్ అశ్విన్ చేయబోయే నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవి తోనే అని అందరూ అనుకున్నారు. దాదాపు ఈ కాంబినేషన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి.

Nag Ashwin Next Movie Planning With Chiranjeevi

కాని నాగ్ అశ్విన్ భారీ సర్‌ప్రైజ్ ఇస్తూ ప్రభాస్ తో తన నెక్స్ట్ సినిమా ని ప్రకటించాడు. ఇదే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత అనూహ్యంగా ఆదిపురుష్, సలార్ లైన్ లోకి రావడం తో ఇక ఈ సినిమా ఇప్పట్లో ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా ఉండదని వార్తలు వచ్చాయి. ఆ వార్తలకి చెక్ పెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ని న్యూ ఇయర్ లో ఇవ్వబోతున్నట్టు వెల్లడించాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అంటున్నారు.