ప్ర‌భాస్ 21 ఎవ‌రితో?.. ఓంరౌత్ ప్ర‌క‌ట‌న‌తో నాగ్ అశ్విన్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. కార‌ణ‌మేంటో తెలిస్తే షాక్ తింటారు!!

బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్ర‌క‌టించి షాకిచ్చాడు డార్లింగ్ ప్ర‌భాస్. అత‌డు సెప్టెంబర్ రెండవ వారం నుండి `రాధే శ్యామ్` చిత్రీకరణను తిరిగి ప్రారంభించబోతున్నాడు. వాస్త‌వ ప్రణాళిక ప్రకారం.. ప్రభాస్ `రాధే శ్యామ్` ను పూర్తి చేసిన‌ వెంటనే నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‌ను పూర్తి చేయాల్సి ఉంది. కానీ బాలీవుడ్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్` ఆకస్మిక ప్రకటన ప్ర‌ణాళిక‌ల‌న్నిటినీ మార్చేసింద‌న్న గుసగుస వినిపిస్తోంది.

nag ashwin tensed on om raut announcement about prabhas 21
nag ashwin tensed on om raut announcement about prabhas 21

ప్రభాస్ నాగ్ అశ్విన్ కు తొలుత సినిమా చేస్తాన‌ని హామీ ఇచ్చినా.. బాలీవుడ్‌లోని మీడియా నివేదికలు ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌ల్ని రాజేశాయి. దర్శకుడు ఓం రౌత్ తాజా ప్రకటనలు వైజ‌యంతి మూవీస్ బృందంలో వేరే ర‌కంగా టెన్ష‌న్స్ క్రియేట్ చేస్తున్నాయ‌ట.

ఓం రౌత్ జనవరి 2021 నుండే `ఆదిపురుష్ 3డి` రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తానని తాజాగా ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అతని ప్రకటనలు నాగ్ అశ్విన్ లో అన‌వ‌స‌ర టెన్ష‌న్ ని పెంచుతున్నాయ‌ట‌. ప్ర‌భాస్ ఇప్పటికే `ఆదిపురుష్` కోసం ప్రిపరేషన్ ప్రారంభించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ‘మహానటి’ దర్శకుడికి టెన్షన్ అంత‌కంత‌కు రైజ్ అవుతోందట‌.