మెగాస్టార్ సినిమా కోసం తండ్రి మరణం నుంచి తేరుకొని వచ్చేసిన దర్శకుడు.!

రీసెంట్ గా కొన్ని రోజులు కితమే టాలీవడో స్టార్ దర్శకుడు అయినటువంటి బాబీ తండ్రి మరణించడంతో తీరని విషాదం నెలకొంది. ఇది జరిగి ఒక్క వారం కూడా పూర్తి కాలేదు కానీ అయినా ఈ దర్శకుడు సినిమా పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

తాను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ సినిమాని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమా ఇది కాగా దీనిపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ లో ఇప్పుడు ఈ దర్శకుడు హాజరయ్యి షాకిచ్చాడు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చెయ్యగా ఆ షెడ్యూల్ పనులు దగ్గరుండి తాను చూసుకుంటున్నట్టుగా కొన్ని విజువల్స్ ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.

మరి ఈ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ కాగా ఈ బిగ్ షెడ్యూల్ లో మొత్తం సినిమా యూనిట్ పాల్గొననుందట. అంటే మాస్ మహారాజ రవితేజ మెగాస్టార్ సహా శృతి హాసన్ కూడా ఈ షూట్ లో పాల్గొనున్నారు. ఇక ఈ సినిమాకి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.