మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ తో వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నెక్స్ట్ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. అదేమిటంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నారు.
వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా
విడుదల కాబోతుంది. రీసెంట్ గానే చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అనిల్ రావిపూడి తో కూడా సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చిరంజీవి. పూర్తి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కి సినిమాలో చిరంజీవి మేకోవర్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ సినిమాలకు ఈ సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని తెలుస్తోంది. 2025 ఏప్రిల్ నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
త్వరలో అధికారికంగా ఈ కాంబినేషన్ పై ప్రకటన రాబోతుందని సమాచారం. ఈమధ్య దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ చిన్నతనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిత్రాలను చూస్తూ పెరిగానని, అలాంటిది వాళ్లతో సినిమాలు తీయడం అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ గారితో సినిమాలు చేశాను ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పారు.
దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా దాదాపు ఫిక్స్ అయిపోయిందని అర్థమవుతుంది. అంతేకాకుండా చిరంజీవి ఇంతకు ముందులా సీనియర్ డైరెక్టర్స్, తనకి బాగా సింక్ అయినా టెక్నీషియన్స్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కానీ ఇప్పుడు తన స్టైల్ మార్చుకున్నారు. యంగ్ జనరేషన్తో పోటీ పడాలంటే యంగ్ టీం తో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు అందుకే వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు తీస్తున్నారు.
