బిగ్ బాస్ హౌస్ లో జరిగే అడల్ట్ సీన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నటి మాధవి లత..!

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రియాలిటీ షో అన్ని భాషలలో ప్రసారం అవుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్లను పూర్తిచేసుకుని ఐదవ సీజన్ ప్రసారమవుతోంది.అయితే ఈ సీజన్లో కంటెస్టెంట్ ల మధ్య కొన్ని అనాగరిక చర్యలు జరుగుతున్నాయంటూ, ఈ కార్యక్రమానికి హోస్ట్ సరిగా వ్యవహరించలేదని కంటెస్టెంట్ నుంచి మొదలుకొని పోస్ట్ వరకు ప్రతి ఒక్కరి గురించి నటి మాధవిలత మాట్లాడుతూ వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ క్రమంలోనే గత ఎపిసోడ్స్ పై ఈమె స్పందిస్తూ బిగ్ బాస్ హౌస్ లో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని, ఒక వ్యక్తి సూసైడ్ చేసుకునే ఆలోచనలు వచ్చే విధంగా కంటెస్టెంట్ లు ప్రవర్తిస్తున్నారు అంటే ఈమె పలువురు కంటెస్టెంట్ కు హోస్ట్ నాగార్జునను ఏకి పారేసింది. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఎపిసోడ్ గురించి స్పందిస్తూ.. బిగ్ బాస్ హౌస్ లో జరిగే అడల్ట్ సీన్స్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ హగ్గులకు, ముద్దులకు అడ్డాగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే షన్ను, సిరి, ప్రియాంక, మానస్ అంటూ కొందరి పేర్లు చెప్పుకొచ్చి వారి గురించి దారుణంగా కామెంట్లు చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లవర్స్ అడ్డా.. ఇందులో మనం పడ్డామంటే అవుతాము చెడ్డ కృష్ణ కృష్ణ పగవాడికి కూడా ఈ బాధ వద్దు అంటూ మాధవి లత ఈ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సిరి, షన్ను ఒకరినొకరు హగ్ చేసుకుని లిప్ లాక్ చేసుకోవడంతో నటి మాధవి లత ఈ విధంగా స్పందించారు.