ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో మోస్ట్ అవైటింగ్ గా ఉన్న సినిమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలే చాలా ఉన్నాయి. కాగా ఈ సినిమాల్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉండాల్సిన సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. అయితే ఈ మాసివ్ బడ్జెట్ అండ్ విజువల్ ట్రీట్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కగా దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించారు.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా హీరోయిన్ కృతి సనన్ అయితే జానకి మాత గా నటించింది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా ఈ హీరోయిన్ పలు క్రేజీ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సినిమా ఫైనల్ అవుట్ పై తన లేటెస్ట్ సినిమా సెహ్ జాదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈసారి వచ్చే ఆదిపురుష్ వెర్షన్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని.
ముందు ప్రతి ఒక్కరికి ఉన్న ఒపీనియన్ మారి తీరుతుంది అని సినిమా రిలీజ్ అయ్యాక దేశం మొత్తం సినిమా కోసం మాట్లాడుకుంటుంది అని అలాంటి సినిమాలో తాను ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పిందట. దీనితో ఈ సినిమాపై ఈమె చేసిన కామెంట్స్ ఒక్కసారిగా ఆసక్తి రేపాయి. మరి ఆమె చెప్పినట్టే ఉంటుందా లేదా అనేది మాత్రం నెక్స్ట్ టీజర్ వచ్చే వరకు చెప్పలేం. ఇప్పటికీ మొదటి టీజర్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక నెక్స్ట్ వచ్చేది కూడా అలానే ఉంటే ఇక చేసేది ఏమి లేదు.
