Krithi Shetty:సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ చేయనున్న కృతిశెట్టి..!

 

Krithi Shetty: ఉప్పెన, శ్యామ్ సింగరాయి సినిమాలతో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా చలామణి అవుతోంది కృతి శెట్టి. ప్రస్తుతం కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. శ్యామ్ సింగరాయి సినిమాకి గాను తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కించుకుంటోంది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో అరడజను సినిమాలు ఉన్నట్లు సమాచారం. డైరెక్టర్ బాల దర్శకత్వంలో సూర్య సరసన తమిళ్ సినిమా లో నటించే అవకాశం కూడా కొట్టేసింది బేబమ్మ.

అంతేకాకుండా రామ్‌తో ‘ది వారియర్’, సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు సాయి ధరమ్ తేజ్ పక్కన నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాని చిత్రబృందం 40 రోజుల లో రెండు షెడ్యూల్ గా చిత్రీకరణ ముగించాలని భావిస్తున్నారట.

పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా కృతి శెట్టి తీసుకుంటున్నట్టు సమాచారం. వినోదయ సీతం అనే తమిళ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. జి స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్కళ్యాణ్ సముద్రఖని సాయి ధరం తేజ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇంకా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న హరిహర వీరమల్లు ఏకకాలంలో షూటింగ్ జరుపుకో పోతున్నాయి.