కీర్తి సురేష్ నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె కెరియర్ మొదట్లో ఎంతో ఇన్నోసెంట్ గా కనిపిస్తూ అలాంటి పాత్రలలోనే నటించారు. అయితే ఈమె తన తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలలో నటించారు. ఒకవైపు కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ సరికొత్త ప్రయోగాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే ఈమె నటిగా కెరియర్లో సినిమా అవకాశాలను అందుకొని నటిస్తున్నప్పటికీ మరోవైపు అగ్ర హీరోలకు చెల్లెలి పాత్రలలో కూడా నటిస్తున్నారు.
ఇకపోతే మహానటి వంటి అద్భుతమైన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.గత కొంతకాలం నుంచి ఎలాంటి హిట్ లేక సతమతమవుతున్న కీర్తి సురేష్ తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టారు. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో తిరిగి ఈమె ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.
ఇక ఈ సినిమాలో కాస్త గ్లామర్ డోర్స్ కూడా పెంచి ప్రేక్షకులను సందడి చేశారు. ఇదిలా ఉండగా తమిళంలో ఈమె నటించిన సాని కాగితం అనే సినిమా కూడా విడుదలైంది.ఈ సినిమా కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంకా మంచి సినిమాలలో నటించాలని ఉందని తెలియజేస్తూనే తాను ఎప్పటికైనా ఓ హీరోతో నటించాలని ఎంతో ఆత్రుతగా అతనితో అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.మరి ఈమె మెచ్చిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అంటే చాలా ఇష్టమట. ఆయనతో నటించడం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.