కాస్ట్‌లీగా మారిన కాజ‌ల్‌..ఖ‌రీదైన దుస్తుల‌తో త‌ర‌చు వార్త‌ల‌లోకి !

క‌రోనా కాలంలో త‌న చిన్ననాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుతో ఘ‌నంగా వివాహం జ‌రుపుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న కాజ‌ల్ హనీమూన్ కోసం మాల్దీవుల‌కి వెళ్లింది. అక్క‌డి అందాల‌ని త‌నివితీరా ఆస్వాదిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంది. మరి కొద్ది రోజులు కాజ‌ల్ తిరిగి ఆచార్య షూటింగ్‌లో పాల్గొన‌నుంది. సింగిల్ షెడ్యూల్‌లో కాజ‌ల్ తో పాటు చిరంజీవి‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తార‌ని స‌మాచారం.

ఇండస్ట్రీకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న కాజ‌ల్ ఈ మ‌ధ్య పెళ్ళి విష‌యాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లోకి ఎక్కుతుంది. అప్పుడు కాజల్ పెళ్లిలో వేసుకున్న డ్రెస్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగింది. అక్టోబర్ 30న ముంబైలోని తాజ్ హోటల్లో వైభవంగా జ‌రిగిన పెళ్లి వేడుక‌లో కాజల్ అగర్వాల్ ధరించిన గులాబీ రంగు లెహంగా ధ‌ర 3 లక్షలు అని అన్నారు. దీనికోసం 20 మంది పనివాళ్ళు నెల రోజుల పాటు కష్టపడ్డారట‌.

ఇక ఇప్పుడు మాల్దీవుల‌లో తాను ధరించిన ఎరుపు రంగు సెమీ షీర్‌ దుస్తుల రేటుకి సంబంధించి సోష‌ల్ మీడియా జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ర్యాట్‌ అండ్‌ బోవా బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్ విలువ అక్ష‌రాల 13 వేల రూపాయ‌ల‌ట‌. ఈ డ్రెస్‌కు త‌గ్గ‌ట్టు కాజ‌ల్ మ్యాచింగ్ ఇయ‌ర్ రింగ్స్, హ్యాట్ పెట్టి కుర్ర‌కారుని తెగ రెచ్చ‌గొట్టింది. మాల్దీవుల్లోని నూత‌న జంట చేసే సంద‌డికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా స్కూబా డైవ్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇదిలా ఉంటే గౌత‌మ్ ,కాజ‌ల్‌లు త్వ‌ర‌లోనే భారీ పార్టీ ఒకటి అరేంజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు .